ఎప్పటి లాగే ఆఫీసు నుంచి వచ్చి టీవీ పెట్టగానే హైదరాబాద్ లో వరుస బాంబు పేలుళ్లు అంటూ బ్రేకింగ్ న్యూస్. అబ్బా మళ్ళీ బాంబు పేలుళ్ళా!!! మొన్ననే కదా గతం లో జరిగిన కొన్ని బాంబు పేలుళ్ళ నిందితులను పట్టుకుని శిక్షించింది... అంటే పట్టుకోవటం మామూలే ఈ ముష్కరుల దాడులూ మాములే... ఎన్నాళ్ళని ఈ నరమేధం, ఎన్నేళ్ళని ఈ మారణహోమం.... వీటి అంతానికి ఏ దేవుడు దిగి రావాలో? రాముడే కోదండం పట్టుకుని రావాలో, కృష్ణుడు సుదర్శనం తో దిగాలో... ఎవరో వచ్చి ఏదో చేసే వరకు ఆగదేమో ఈ రావణ కాష్టం?
ఈ దాడులు జరగగానే, పేలుళ్ళను తీవ్రంగా ఖండించిన ప్రధానమంత్రి, దోషులు ఎలాంటి వారైనా వదిలిపెట్టం అని హెచ్చరించిన ముఖ్య మంత్రి అన్నవార్తలు... ఖడిస్తున్నాం, కఠినంగా శిక్షిస్తాం అని అనటం తప్ప ఇంకేం చెయ్యగలరు? కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్న, జరిగిన, దాడుల సంగతి నిందితుల సంగతి ఏమయ్యిందో ఎవ్వరికీ తెలీదు... ఇలా ఎప్పటికప్పుడు దాడులు జరిగినప్పుడల్లా, పట్టేసుకుంటాం, పొడిచేస్తాం అని మాత్రం సదరు ప్రభుత్వం తరపునుంచి వింటూనే ఉంటాం.... కాని జరిగేది జరుగుతూనే ఉంటుంది, జరగనిది ఎప్పటికీ జరగదు.
కాని ఏమిటి ఈ నరమేధం?? ఎప్పుడో పురాతన దుర్మార్గపు రాచరిక వ్యవస్థలో లేము కదా.. ఇష్టం వచ్చినట్టు అరాచకాన్ని సృస్టించటానికి... ఉన్నది 21వ శతాబ్దం లో, ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో... కాని ఈ అరాచకం అణచివేయటానికి మాత్రం ఇంకా పట్టే చిక్కలేదు.... ఈ మారణహోమం లో బలయ్యేది ఎప్పుడూ సామాన్యుడే.... ఆటవిడుపు కోసం వచ్చిన సామాన్యులు, తమ ఇళ్ళకు చేరుకోటానికి బస్సు స్టాండ్ లో బస్సుల కోసం ఎదురుచూస్తున్న సాధారణ ప్రజానీకం, విద్యార్ధులు, పొట్టకూటి కోసం వచ్చిన అమాయకులు... వీళ్ళేదో ప్రమాదం లోనో యుద్ధాల్లోనో, గొడవల్లోనో ప్రాణాలు కోల్పోవట్లేదు...
సాధారణ జీవితం కూడా గడపటానికి వీలులేని వ్యవస్థలో ఉన్నామా... ఈ ఉగ్రవాదానికి, ఉన్మాదానికి అంతం అనేదే లేదా? పోనీ ఆపటానికి మనవంతు చేస్తున్నదేది? దాడులు జరగొచ్చని ముందే హెచ్చరించిన తర్వాత కూడా ఇంతటి నిర్లక్షం నిర్లిప్తత?.... దీనికి ఎవరు బాధ్యులు? ఎప్పటిలానే బాధ్యతా రహితం గా ఉన్న ప్రభుత్వమా? మనమేమి చేయ్యలేములే అని వదిలేసే ప్రజానీకమా? మన దాక వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకునే మేధావి వర్గమా? ఎవరిని బాధ్యుల్ని చెయ్యగలం... ఎవరికి వారు వేలెత్తి చూపేవారే.. పోనీ మన దాయాదుల దేశాల లో జరుగుతున్న నరమేధం కన్నా ఇది పర్వాలేదులే అని సరిపెట్టేసుకుందామా? ఇవన్నీ బదులు లేని ప్రశ్నలే...
ఏదేమైనా ఈ అరాచకం లో ఎప్పుడూ బలైపోతున్నది మాత్రం ప్రజానీకమే.. అందుకే ఏదో ఒక దేవుడు ఏదో ఒక అవతారమెత్తి రావాల్సిందే...
ఏ
రామ
బాణం
ఆర్పుతుందో
ఈ
రావణ
కాష్టాన్ని??
ఏ
కృష్ణ
గీతి
ఆపుతుందో
ఈ
మారణహోమాన్ని??
అవతారమెత్తుతాడు అదిగో ఇదిగో అంటున్నారు....ఎప్పుడో ఏమో!
ReplyDeleteఆ వచ్చే అవతారమేదో కొంచెం త్వరగా వస్తే బావున్నండి....
Deleteరాచరికం లో ఇలా అరాచకాలు జరిగితే రాజు చూస్తూ ఊరుకోడు కదా, ఇది ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి స్వేచ్చ ఉన్నది, ఉండాలి అని అనుకుంటాము కదా, తీవ్రవాదులు కూడా స్వేచ్ఛా కావాలని అనుకోవడం లో తప్పు ఏముంది?
ReplyDeleteకాని మన ప్రజా ప్రతినిధులకు ప్రజా భద్రత కన్నా, వోటరు స్వేచ్ఛా ముఖ్యం అయింది. కాబట్టి మనకు ఈ తిప్పలు తప్పవు.
స్వేచ్చ ఉంది కదా అని ఏది పడితే అది చేస్తామంటే కుదరదు కదండి, అయినా ప్రజాస్వామ్యం నిలబడేది ఇచ్చిన హక్కులు, వేరే వాళ్ళ హక్కులు భంగం కలగకుండా ఉన్నప్పుడే. మన దేశం లో ప్రజలు మాత్రమే ఉన్నారండి, వాళ్ళకి ప్రతినిధులు లేరు, వాళ్ళందరూ దొరికింది దండుకునే పనిలో ఉన్నారు. అందుకే ఏదో ఒక అవతార పురుషుడే రావాలి.
Deleteby the way thanks for the comment
Only one god can save...HUMANITY!
ReplyDelete